- Advertisement -
- – జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు
– శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి - – జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు
- నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
- వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని, శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు, సి.ఐ లు, ఎస్.ఐ లు,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -