- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని (వేమన్న) శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని తన నివాసంలో వేం నరేందర్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాస వేణుగోపాల్ యాదవ్, వేం నరేందర్ రెడ్డికి ఆయన చిత్రపటంతో ఉన్న జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మహమ్మద్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



