మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్
నవతెలంగాణ – నెల్లికుదురు : వీడియో కాన్ఫరెన్స్ సినీట్ల ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మునిగేలా వీడు రైతు వేదిక నుండి తాసిల్దార్ చందా నరేష్ ఆలేరు రైతు వేదిక నుండి ఎంపీడీవో బాలరాజు తెలిపారు. మండలంలోని రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మూడవ దశ లో చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను రైతులతో ముఖాముఖి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం లో గల మొత్తం 5 రైతు వేదికలలో 3 రైతు వేదికలకు మూడు దశలలో (రెండవ దశలో 01 మూడవ దశలో 02 )వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. మూడో దశలో ఏర్పాటు చేయబడ్డ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదుర్ రైతు వేదిక లో మండల వ్యవసాయ అధికారి షేక్ యస్మీన్ మునిగలవీడు రైతు వేదిక నుండి తహసీల్దార్ చందా నరేష్, ఆలేరు రైతు వేదిక నుండి ఎంపిడిఓ బాలరాజు, పిఎసిఎస్ నెల్లికుదుర్ ఛైర్మెన్ లక్మి చంద్రశేఖర్ రెడ్డి ఏ ఈ ఓ లు ఈ రవి, ఆర్ చందన., ఏ. ప్రతిభ, బి. మణికంఠ వివిధ గ్రామాల నుండి రైతులు పాల్గొన్నారు.
రైతులతో వీడియో కాన్ఫరెన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES