- Advertisement -
ఎన్నికల చిహ్నాలు కేటాయించిన ఈసీ
న్యూఢిల్లీ : తమిళనాడులో చలనచిత్ర కథానాయకులు స్థాపించిన కీలక పార్టీలకు ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల చిహ్నాలను కేటాయించింది. ప్రముఖ నటుడు విజయ్ నెలకొల్పిన తమిళ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ఎన్నికల చిహ్నంగా ‘విజిల్’ (ఈల) గుర్తును ఇసి కేటాయించింది. అలాగే దిగ్గజ నటుడు కమల్హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ (ఎంఐఎం) పార్టీకి ఇది వరకే కేటాయించిన ‘బ్యాటరీ టార్చ్’ను ఈ ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
- Advertisement -



