- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని మండల ప్రజ పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ఆడిట్ జిల్లా ఉప సంచాలకులు విజయ్ కుమార్ బాధ్యతలను గురువారం చేపట్టారు. అనంతరం మండల అధికారులతో సమావేశం నిర్వహించి, వివిధ శాఖల అధికారులు పని తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఏ శాఖలో ఏ ఏ పనులు కొనసాగుతున్నాయి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ బ్రహ్మానందం, తహశీల్దార్ శేఖర్, ఎస్సై రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -