Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూనియర్ కళాశాలకు గ్రామాభివృద్ధి కమిటీ  చేయూత

జూనియర్ కళాశాలకు గ్రామాభివృద్ధి కమిటీ  చేయూత

- Advertisement -

– కుర్చీలు వితరణ, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేయూతను అందించారు. కళాశాలలో అధ్యాపకులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలను, అధ్యాపకులతో పాటు కళాశాలకు విచ్చేసే విద్యార్థులు త్రాగేందుకు వీలుగా డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలను సమకూర్చారు. ఈ మేరకు గురువారం కుర్చీలను అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపక బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున అవసరమైన అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలకు ఏ అవసరం ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీని కళాశాల అధ్యాపకులు సంప్రదించాలని, ఎల్లవేళలా సహాయ సహకారాలు గ్రామ అభివృద్ధి కమిటీ అందిస్తుందని పేర్కొన్నారు. అధ్యాపకులు తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్న చిన్న అవసరాలను కూడా త్వరలోనే తీరుస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇటీవల పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తమ వంతుగా సహకారం అందిస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ కోశాధికారి నూకల బుచ్చి మల్లయ్య, సభ్యుడు సున్నం మోహన్, కళాశాల అధ్యాపకులు మధు, వెంకటేష్, వైష్ణవి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -