Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలుమేడిపల్లి స్టేజిలో ఎక్స్ ప్రెస్ బస్సు ఆపాలని డిపో మేనేజర్ కు గ్రామస్తుల వినతి

మేడిపల్లి స్టేజిలో ఎక్స్ ప్రెస్ బస్సు ఆపాలని డిపో మేనేజర్ కు గ్రామస్తుల వినతి

- Advertisement -


నవతెలంగాణ – గాంధారి

గాంధారి మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు ఉంచిన విజ్ఞప్తికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి  తక్షణమే స్పందించారు. మేడిపల్లి గ్రామం చుట్టూ ఉన్న సితాయిపల్లి, గండిపేట్, చెన్నాపూర్, కొండాపూర్, హనుమాన్ తాండ, రతిరాం తండా, చంద నాయక్ తండా గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉండటంతో ఈ ప్రాంత ప్రజలకు ఈ రిక్వెస్ట్ స్టాప్ ఎంతో అవసరమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో ఎమ్మెల్యే  బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సరిత దేవితో ఫోన్లో మాట్లాడి, అధికారికంగా వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. దీనిని అనుసరించి మేడిపల్లి గ్రామస్తులు గుంజ కిషన్, పిట్ల సురేష్, పిట్ల తిరుపతి రాములు మరియు మండల స్పోక్స్ పర్సన్ కాగల మోహన్ యాదవ్ లు కలిసి డిపో మేనేజర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. డిపోమేనేజర్ సరితదేవి  సానుకూలంగా  స్పందించి రేపటి నుండే మేడిపల్లి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ అమల్లోకి వస్తుందని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -