వ్యవసాయ శాఖ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
జూన్ 5 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులందరికీ రైతు భీమాకు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడారు కొత్తగా భూములు కొనుగోలు చేసి జూన్ 5 నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన 18 నుండి 59 సంవత్సరాలు కలిగి ఉన్న రైతులు రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.భూభారతి, సీసీఎల్ ఏ లో నమోదైన రైతులకు అవకాశం ఉందని తెలిపారు.ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండి గతంలో రైతు బీమాకు దరఖాస్తులు చేసుకొని రైతులకు అవకాశం ఉందని తెలిపారు.
గతంలో భీమాకు అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతు బీమాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈనెల 13 తో రైతు బీమా ముగియనుండడంతో పాత వాటిని పునరుద్ధరించడంతోపాటు నూతనంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులకు రైతు బీమాకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ఈ నెల 14 నుంచి అమలు కావడంతో వ్యవసాయ శాఖ నూతనంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు.
రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES