- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలంలోని కల్లడి గ్రామంలో ఇటీవల మరణించిన బాగోతుల సాయమ్మ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ సాయమ్మ కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని అధిగమించేలా భగవంతుడు వారికి మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీసీసీ సెక్రటరీ డేగ పోశెట్టి, గ్రామ శాఖ అధ్యక్షుడు నీలగిరి శ్రీనివాస్, బీసీ సెల్ పడమటి ప్రవీణ్, సెక్రటరీ నర్స రెడ్డి, ఉపాధ్యక్షుడు అబీబ్, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొండా శివకృష్ణ, ఆలూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిరికొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



