నవతెలంగాణ – ఆర్మూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ.. జిల్లా ముఖ్య నాయకులతో ఇన్చార్జి మినిస్టర్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ నియోజకవర్గంలో మంజూరైనటువంటి 3500 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టుటకు దృఢ సంకల్పంతో ఉన్నామని అన్నారు. దీనిలో భాగంగా పేదలకు ఇంటి నిర్మాణం భారం కాకుండా అతి తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపడుతున్న జర్మనీ టెక్నాలజీ పద్ధతిని పలువురు నాయకులతో కలిసి పరిశీలించి నియోజకవర్గంలో అమలు చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.. ఈ టెక్నాలజీ ద్వారా పేదలకు ఇంటి నిర్మాణ భారం తగ్గుతుందని దీనితో పాటు సమయ భావం తగ్గుతుందని అన్నారు.
పేదల సొంతిండ్ల కోసం వినయ్ రెడ్డి ఎనలేని కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES