- Advertisement -
ముంబయి : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ ఇండియా తన ప్రీమియం ఎస్యువి ‘టైరాన్ ఆర్-లైన్’ స్థానిక అసెంబ్లీని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్లో ప్రారంభించినట్లు తెలిపింది. 2026 మార్చి త్రైమాసికంలో ఈ కారును అధికారికంగా విడుదల చేసేలా.. ఉత్పత్తిని వేగవంతం చేసింది. అత్యాధునిక జర్మన్ ఇంజనీరింగ్ను భారతీయ వినియోగదారు లకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా ఎండి, సిఇఒ పియూష్ అరోరా పేర్కొన్నారు. కస్టమర్ల జీవనశైలికి అనుగుణంగా దీనిని రూపొందించామని పేర్కొన్నారు.
- Advertisement -


