- Advertisement -
న్యూఢిల్లీ: ఫోక్స్వ్యాగన్ ఇండియా తన సరికొత్త 7సీటర్ లగ్జరీ ఎస్యువి టెరాన్ ఆర్ లైన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ప్రారంభ ధరను రూ.46.99 లక్షలుగా నిర్ణయించింది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ డిఎస్జి, 4మోషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ఇంటీరియర్లో 700 వాట్స్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ మరియు మసాజ్ సీట్లు వంటి 23 ప్రీమియం ఫీచర్లు ఉన్నాయని ఆ కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లి తెలిపారు. లగ్జరీతో పాటు అత్యుత్తమ పని తీరును కోరుకునే భారతీయుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకు వచ్చినట్లు తెలిపారు.
- Advertisement -



