న్యూఢిల్లీ : యూజ్డ్ కార్ల విక్రయ వేదిక కార్స్24 తమ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది. దాదాపు 200 మంది సిబ్బందికి ఉద్వాసన పలికింది. ఆ సంస్థ నుంచి ఇటీవల సాఫ్ట్బ్యాంక్ తమ పెట్టుబడు లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా కొన్ని క్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కార్స్24 సీఈఓ విక్రమ్ చోప్ర పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 200 మంది తీసివేయాల్సి వచ్చిందన్నారు. కొన్ని నెలలుగా తమ అంచనాలకు అనుగుణంగా ప్రాజెక్టులను డెలివరీ చేయలేకపోయామన్నారు.
- Advertisement -