నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి, జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో శుక్రవారం ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ఓటర్ డే, ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పడంపల్లి గ్రామపంచాయతీ గ్రామంలో గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ కుమారిసంజు, జుక్కల్ గ్రామపంచాయతీ సర్పంచ్ కర్రే వార్ సావిత్ర సాయాగౌడ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలోని ఖాళీ స్థలాలలో వనమహోత్సవ కార్యక్రమంలో నాటిన చెట్ల మొక్కలకు నీటిని అందించారు.
ఈ సందర్భంగా పడంపల్లి గ్రామ సర్పంచ్ విజయ కుమారి, ఎంపియుపిఎస్ ప్రధానోపాధ్యాయుడు జగదీష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరం అని వర్షాలు సకాలంలో కోసి రైతుల ఇంట సిరి సంపదలు పెరగాలంటే చెట్లు ఎంతో అవసరమని అందుకే వృక్ష సంపద ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ , తాసిల్దార్ మారుతి , ఆర్ఐ రామ్ పటేల్ , పడంపల్లి జిపి కార్యదర్శి గంగాధర్ , జుక్కల్ జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ , టీఎ రమేష్ , పిఏ రవీందర్ రెడ్డి. సిఎ కాశీనాథ్, అశోక్ గౌడ్, పడంపల్లి ఎఫ్ఏ సూర్యకాంత్ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది అనిల్ కుమార్ , గంగాధర్, నాయకులు సాయ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.



