నవతెలంగాణ – కామారెడ్డి : నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో విఆర్కే విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని వి ఆర్ కె, ఆర్ కె సీఈవో జైపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ బైపిసి ఫస్టియర్ విద్యార్థిని 440 కి గాను 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్ గా నిలిచారు. అదే విధంగా మిగిలిన విద్యార్థులు సైతం అంతకుముందు కంటే మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నవోదయ లో టాపర్ గ నిలిచిన విద్యార్థులను ఆర్కే కళాశాల సీఈవో డాక్టర్, జైపాల్ రెడ్డి అభినందించారు. కామారెడ్డి ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులను సైతం ఉత్తమ విద్యతో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని, ఈ ఫలితాలకు సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందం కు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధించి విద్యార్థులను ఉత్తమ పౌరులు గా తయారవ్వడంలో కృషి చేస్తామని తెలియజేశారు. కాపాడుగా నిలిచిన విద్యార్థులను పుష్పగుచ్చం, మేమెమటోలతో సత్కరించారు. విద్యార్థులందరికీ మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకర్, డీన్ నవీన్, ఆధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో సత్తా చాటిన విఆర్కె విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES