- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
వార్డు సభ్యుల శిక్షణ తరగతులు గత ఐదు రోజులుగా మండల కేంద్రమైన తాడిచెర్ల రైతువేదికలో శనివారం విజయవంతం ముగిసినట్లుగా మండల ఎంపిడిఓ క్రాoతికుమార్, సూపర్ డెంట్ శ్రీరామూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డుసభ్యులందరికీ ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ తరగతులు అనంతరం ఆన్లైన్లో సభ్యులకు ఎగ్జామ్ నిర్వహించి హాజరైన వారందరికీ సర్టిఫికెట్స్ అమదజేసినట్లుగా తెలిపారు. ఐదు రోజులపాటు ట్రేనీలుగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులు సాయి చరణ్, సాంబశివుడు, స్వామి, శివ ప్రసాద్, రాజులకు వార్డు సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



