Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి వివేక్‌కు ఘన స్వాగతం

మంత్రి వివేక్‌కు ఘన స్వాగతం

- Advertisement -

– గజమాలలతో కాంగ్రెస్‌ నాయకులు, అభిమానుల సన్మానం
నవతెలంగాణ-జైపూర్‌

కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి గడ్డం వివేక్‌ మొదటిసారి మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గానికి రాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం హైదరాబాద్‌ నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా గోదావరిఖని నుంచి ఇందారం చేరుకున్న మంత్రికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన వివేక్‌కు నాయకులు, అభిమానులు గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇందారం నుంచి చెన్నూర్‌ వరకు వాహనాల ర్యాలీ కొనసాగింది. మంత్రి వివేక్‌కి అధికారులు కూడా పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పర్యవేక్షణలో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, జైపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, భీమారం ఎస్‌ఐ శ్వేత భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఇందారం ఎక్స్‌ రోడ్డు వద్ద రోడ్‌షోలో మంత్రి మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా ఆపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు మైనింగ్‌ శాఖ ఇచ్చారని, ఇసుక దందాను నిలిపేసి ఎక్కడా అవినీతి, అక్రమాలు లేకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని అన్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల కట్టుబడి పని చేస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -