Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందేనా..?

ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందేనా..?

- Advertisement -

– అసహనం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
– లేఖలో వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం
– ఆదివాసీల జోలికి వెళ్లొద్దని అటవీ అధికారులకు స్పష్టం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఆదివాసీ హక్కులపై మాజీ మావోయిస్టు, మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని, జీవో 49పై స్పందించడం లేదని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంత్రికి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట వచ్చిన లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. కొమురం భీం జిల్లాలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఏర్పాటుకు మేలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గురువారం ములుగు జిల్లా ఏటూరు నాగారానికి వచ్చిన మంత్రిని విలేకరులు ప్రశ్నిం చగా ఆమె స్పందించారు. తానేప్పుడు తన మూలాలను మరిచిపోలేదని, ఆదివాసీలు, గిరిజనుల హక్కులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా నని తెలిపారు. ఇటీవల తనతోపాటు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం అటవీ శాఖాధికారు లకు పోడుకు సంబంధించి గిరిజనులపై అక్రమ కేసులు పెట్టొద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చామని తెలి పారు. మావోయిస్టు పార్టీ ఇచ్చామని చెబుతున్న లేఖ ఆ పార్టీనే ఇచ్చిందన్న దానిపై స్పష్టత లేదన్నారు. మావోయిస్టుల లేఖ పేరుతో మహిళని కూడా చూడకుండా అసభ్యపదజాలం వాడుతూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు తనను సోషల్‌ మీడియా వేదికగా టార్గెట్‌ చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని అన్నారు. మావోయిస్టుల పేరుతో చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు. ఎవరైనా నిజాలనే మాట్లాడాలంటూ మావోయిస్టుల లేఖపై వివరించారు. జీవో 49 రద్దు కోసం తాను చేసిన ప్రయత్నాలను వివరించారు. రాజకీయాలక తీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి జీవో 49ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -