- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆదివారం గోదావరి నది నుంచి గంగాజలాలు తీసుకువచ్చారు. గ్రామస్తులు డప్పు వాయిద్యా లతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధి, సమృద్ధి కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ అభిషేకాన్ని చేపడుతున్నట్లు వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పంటలు విస్తారంగా పండాలని, గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.
- Advertisement -