- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు గంగ నీళ్లతో జలాభిషేకాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు బాగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలను కోరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడిసి అధ్యక్షులు భోజరాజు, క్యాషియర్ నచ్చు గంగాధర్, సెక్రెటరీ మట్ట శ్రీనివాస్, బి జె పి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ,వివిధ కుల సంఘాల సభ్యులు , ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -