- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఒమర్ యాగీ గాలి నుంచి నేరుగా స్వచ్ఛమైన నీటిని తయారుచేసే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. భారీ ప్లాంట్లు, విద్యుత్ అవసరం లేకుండా, కేవలం షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే యంత్రంతో రోజుకు 1,000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయవచ్చు. రెటిక్యులర్ కెమిస్ట్రీ ఆధారంగా పనిచేసే ఈ పరిజ్ఞానం, అత్యంత పొడి వాతావరణంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. ఈ ఆవిష్కరణ ప్రపంచ దాహార్తిని తీర్చగల కీలక పరిణామంగా భావిస్తున్నారు. భారతదేశంలో కూడా అక్వో అనే సంస్థ ఇలాంటి వాటర్ జనరేటర్లను తయారు చేస్తోంది.
- Advertisement -



