- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యందు ఆదివారం గ్రామదేవతలకు జలాభిషేకాలు నిర్వహించినారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరినారు. స్థానిక కౌన్సిలర్లు రవి గౌడ్, కాశీరాం, ఆకుల రాము తదితరుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు సైతం నిర్వహించి అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామదేవతలకు జలాభిషేకాల నిర్వహణ కార్యక్రమంలో వీడిసి ప్రతినిధులు పీ ప్పెర శ్యామ్, వేంపల్లి పెద్ద రాజన్న, మల్లెల సాయి రెడ్డి, మైపాల్, పోచంపేట శ్రీను, బొమ్మెన జగన్ , చిన్నారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -