శాట్ చైర్మెన్ శివసేనారెడ్డి ఆకస్మిక తనిఖీ
మెస్ కాంట్రాక్టర్పై ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.460 కోట్లు భారీ బడ్జెట్ను కేటాయించినా స్పోర్ట్స్ స్కూళ్లలో సదుపాయాలు మాత్రం బాగుపడడం లేదు. శుక్రవారం శాట్ చైర్మెన్ శివసేనారెడ్డి కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ను ముందస్తు సమాచారం లేకుండా సందర్శించారు. క్రీడాకారుల హాస్టల్ గదులు మొదలు, క్లాస్ రూమ్లు, వంటశాల అన్నింటినీ తనిఖీ చేయగా వారికి పెడుతున్న అల్పాహారం, భోజనం చూసి విస్తుపోయారు. నీళ్ల పాలు, ఉడికి ఉడకని వంటలు చూసి స్పోర్ట్స్ స్కూల్ సిబ్బంది, మెస్ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అందించే డైట్ విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. మరో రెండు నెలల్లో ఈ మెస్ కాంట్రాక్ట్ ముగియనుండడంతో మరోసారి టెండర్లో కూడా సదరు కాంట్రాక్టర్ను అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. మిగిలిన రెండు నెలలు కూడా క్రీడాకారులకు డైట్ చార్ట్ ప్రకారం మంచి భోజనం అందించాలని, లేకపోతే మొత్తానికి బ్లాక్ లిస్ట్లో పెట్టమని డీవైఎస్ఓ శ్రీనివాస్కు సూచించారు.
నీళ్ల పాలు..ఉడికి ఉడకని భోజనం
- Advertisement -
- Advertisement -