Sunday, June 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంతిండిలేక ఇసుక తింటున్నాం..

తిండిలేక ఇసుక తింటున్నాం..

- Advertisement -

ప్లీజ్‌ సాయం చేయండి : గాజాలో
కన్నీరు పెట్టిస్తున్న బాలుడి వీడియో
గాజా :
ఆటబొమ్మలతో, బడి పాఠాలతో కాలం గడపాల్సిన చిన్నారులు గాజాపై ఇజ్రాయిల్‌ బాంబుల వర్షంతో ఆకలికి అలమటిస్తున్నారు. ఉండడానికి నిలువ నీడ లేక, తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక్క పూటైనా తమ ఆకలి తీరేందుకు ఏదైనా సాయం అందితే చాలు అనుకునే దుర్భర స్థితిలో పాలస్తీనా ప్రజలు ఉన్నారు. కనీసం వారికి వైద్యం కూడా అందని పరిస్థితి. ఇక దాడుల్లో వందలాది మంది మృతి చెందడం, తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మరోపక్క ఆకలి చావులు పెరుగుతున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.

తిండి దొరక్క…
ఇజ్రాయిల్‌ దాడి నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు అందాల్సిన సాయం ట్రక్కులను కూడా ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు. వాటిని బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వందల మంది ఒక్క రొట్టెముక్క దొరికితే ఈ పూట గడుస్తుందనే స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కంటతడి పెట్టిస్తున్న వీడియో
గాజా ప్రాంతంలో కొనసాగుతున్న వాస్తవ పరిస్థితులపై ఓ బాలుడు తమ దీనస్థితిని చెబుతున్న వీడియో ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తిన టానికి తిండి లేక ఇసుక తిని ఆకలి చంపుకుంటున్నామని బాలుడు కన్నీరు పెట్టు కున్నాడు. ప్రతిరోజూ తమకు ఆహారం వస్తుందని చెబుతున్నారే కానీ ఒక్క ట్రక్కు కూడా రావటం లేదని వాపోయాడు. తమపై దయ చూపించాలని, తమకు తినటాని సహాయం చేయాలంటూ రోధించాడు. ఒక్క బ్రెడ్‌ ముక్క రూ.450కి అమ్ముతున్నారని చెప్పాడు. ఈ మాటలు పలువురిని కలిచివేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -