మీరు సిద్ధమా..!!
అక్రమ ఇసుక లారీని పట్టుకున్నందుకు గిరిబాబును బదిలీ చేయించింది వాస్తవం కాదా..!
కాంగ్రెస్ నాయకులు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రమాణం చేయగలరా..!
మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి.
నవతెలంగాణ – తాడ్వాయి : ఇటీవల ప్రభుత్వ మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు చూపించడానికి మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మీరు సిద్ధమేనా అని మాజీ జెడ్పిటిసి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రామసహయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కాటా పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో మంజూరు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి అంకంపల్లి గ్రామపంచాయతీ, గవర్నర్ దత్తత తీసుకున్న కొండపర్తి మినహా మండలంలో ఏ గ్రామ పంచాయతీలో అర్హులు అయినటువంటి అత్యంత పేదలకు ఇండ్లు ఇవ్వకుండా అనర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలకు, భూమి ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసి అక్రమాలను అవినీతిని నిరూపించడానికి బిఆర్ఎస్ పార్టీ గా మేము సిద్ధం?? మీరు సిద్ధమా?? అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు సిద్ధంగా ఉన్నట్టయితే తేదీ సమయం మీరే నిర్ణయించండి. మేము రావడానికి సిద్ధం అన్నారు.మేడారం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.కానీ వాస్తవంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటినుండి ఇసుక అక్రమ తరలింపు వాస్తవం కాదా ఇట్టి విషయంలో అక్రమ తరలింపుకు అడ్డుకున్న ఎమ్మార్వో గిరిబాబును బదిలీ చేసింది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాకపోతే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల మీద ప్రమాణం చేయగలరా లేక పోతే మేము ప్రమాణం చేయడానికి సిద్ధం? అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య,మాజీ కోఆప్షన్ మెంబర్ దిలావర్ ఖాన్,మాజీ సర్పంచ్ మేడిశెట్టి నరసింహులు,మాజీ ఎంపిటిసి దానికి నరసింహారావు, మాజీ సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ, మాజీ అధ్యక్షులు నూశెట్టి రమేష్,నాలి నాగేశ్వరరావు, నాలి రమేష్, పాయం సమ్మయ్య, బీసీ సెల్ మండల నాయకులు గండుబిక్షపతి, మాజీ ప్రధాన కార్యదర్శి వహీద్, రామిల్ల లాలయ్య, రజాక్ ,అరేంకృష్ణ, మటన్ శోభన్,లంజపల్లి వెంకటేష్ ,లంజాపెళ్లి రాంబాబు, గడ్డం వెంకన్న,బందెల తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.