రోడ్డుపై ధర్నా చేసిన రైతులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : గౌరవెల్లి ప్రాజెక్టు కింద తమ పొలాల్లో సబ్ మైనర్ కాలువ నిర్మాణం చేపట్టొద్దని , ఆ కాలువలకు తమ భూములను ఇవ్వమని రైతులు గురువారం గాంధీనగర్ గ్రామంలోని హుస్నాబాద్ నుండి జనగామ వెల్లె రోడ్డుపై ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు , తాహసిల్దార్ లక్ష్మారెడ్డి రైతుల వద్దకు వచ్చి ధర్నా చేయవద్దు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. దీంతో రైతులు హుస్నాబాద్ మండలంలోని బల్లునాయక్ తండా, మీర్జాపూర్, గోల్లపల్లి, వంగరామయ్య పల్లి రైతులు విలువైన భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీడు భూముల్లోకి కాలువలు తరలించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ కార్యాలయానికి వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని, నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని అధికారులు తెలుపడంతో ధర్నా విరమించారు. అనంతరం తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
మా భూముల్లో సబ్ మైనర్ కాలువలు వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES