- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: : కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో … ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో త్వరలో తెలంగాణ, ఎపి, కర్నాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు ట్రావెల్స్ మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని అన్నారు.
- Advertisement -



