– అడ్మిషన్ పొందుతున్న విద్యార్థులకు అభినందనలు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజిలో మొదటి సంవత్సరం ప్రారంభం అవుతున్న కాలేజిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థుల అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిందని, ఆన్లైన్ రిజిస్టేషన్ ప్రక్రియ కూడ ప్రారంభమైందన్నారు.
21 ప్రభుత్వం కాలేజి లలో ఈ సంవత్సరం మొదటిసారి శాతవాహన యూనివర్సిటీ కి సంబంధించి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి లో తరగతులు ప్రారంభం అవుతున్నాయన్నారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజి లో బి టెక్ (ఇ సి ఇ)( సి ఎస్ ఇ) (ఐ టి ),(ఏ ఐ) కోర్సులు ప్రతి విభాగంలో 60 సీట్లకు గాను మొత్తం 240 సీట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ ను బట్టి మనకు సీటు కేటాయింపు ఉంటుందన్నారు. హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు , సమీప జిల్లాల విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంకును బట్టి హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజి లో అడ్మిషన్ తీసుకోవలన్నారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజి లో మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందుతున్న విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు కౌన్సిలింగ్ లో ప్రథమ ప్రాధాన్యతగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజికి ఆప్షన్ ఇవ్వగలరన్నారు.