ఐద్వా జాతీయ మహాసభల్లో విజయరాఘవన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా సంఘం జాతీయ సమావేశాన్ని స్వాగతిస్తూ, దేశాన్ని విభజించే బీజేపీ కార్పొరేట్ హిందూత్వ విధానాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం కొనసాగించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్య్యూయూ) అధ్యక్షురాలు ఎ.విజయరాఘవన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో జరుగుతున్న ఐద్వా జాతీయమహాసభల్లో ఆయన సౌర్ధసందేశమిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసి ఆమోదించబడిన వీబీ జీ రామ్ జీ చట్టం మహిళా కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కులపై దాడిని మనం వ్యవస్థీకృత పద్ధతిలో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. భక్తి, మతం పేరుతో మహిళా వ్యతిరేక విధానాలను బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు.
మనం కలిసి పోరాటం కొనసాగించాలి
- Advertisement -
- Advertisement -



