Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రామిక మహిళల హక్కుల కోసం ఉద్యమించాలి.. 

శ్రామిక మహిళల హక్కుల కోసం ఉద్యమించాలి.. 

- Advertisement -

రాష్ట్ర కన్వీనర్ ఎస్ వి రమా 
నవతెలంగాణ – కట్టంగూర్
శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్ వి రమా పిలుపునిచ్చారు. ఆదివారం శ్రామిక మహిళ నల్లగొండ జిల్లా సదస్సు మండల కేంద్రంలోనీ వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో లకపాక భూలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సు కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. సమాజంలో సంపద సృష్టిలో శ్రామిక మహిళలు గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని, వీరిని సమాజం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా మహిళల శ్రమను గుర్తించడంలో, సరైన వేతనాలు ఇవ్వడంలో, సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.. పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు వేయాలనున్న నిబంధనలు ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న వందేళ్ల నాటి కార్మిక చట్టాలను రద్దుచేసిందని వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తేవడంతో కార్మిక హక్కులు కాల రాస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5,6 తేదీల్లో కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో జరగనున్న శ్రామిక మహిళ రాష్ట్ర కన్వెన్షన్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, శ్రామిక మహిళా కన్వీనర్ ఎం ప్రమీల, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న, జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, సుధీర్, రవీందర్, సత్యనారాయణ, లకపాక రాజు, వెంకటమ్మ , జానకి,  సునీత,బొందు పార్వతి, పొడిశెట్టి నాగమణి, మంగమ్మ బోయపల్లి చంద్రమ్మ ,మిరియాల శ్రీవాణి కత్తుల పద్మ, దాడి అరుణ పార్వతమ్మ పెరిక కళావతి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -