నవతెలంగాణ -ముధోల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని బైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి అన్నారు. ముధోల్ మండలంలోని చింతకుంట లో తహశీల్దార్ శ్రీలత , రాం టేక్ గ్రామంలో ఆర్ఐ నారాయణ రావు పటేల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు మంగళవారం ప్రారంభించారు. అయితే రాం టెక్ గ్రామ రెవెన్యూ సదస్సును ఆర్డీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేం దుకే గ్రామాలకు రెవెన్యు అధికారులను రప్పించి తమ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పట్టాపాస్ బుక్ లలో తప్పులు దొర్లడం తదితర అంశాల గురించి భూ సమస్యకు సంబంధించిన ప్రతి అంశం గురించి రైతులు నేరుగా ఈ సదస్సులో దరఖాస్తు చేసుకున్నట్లయితే 100% పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. చింతకుంట గ్రామ రెవెన్యూ సదస్సులో 21 దరఖాస్తులు, రాంటెక్ సదస్సు లో 46 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.
భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES