– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– చిట్యాలలో మార్కెట్ యార్డు దుకాణాల ప్రారంభం
నవతెలంగాణ-చిట్యాల
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మార్కెట్ యార్డు లో బుధవారం దుకాణాలను మంత్రి ప్రారంభించా రు. మార్కెట్ చైర్మెన్గా నర్రా వినోద ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చిట్యాలలో మూడు అదనపు అండర్పాస్లను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో వరి ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేంది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని చెప్పారు. చిట్యాల మండలానికి సంబంధించి 8 గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్యా ర్డు పరిధిలో ఉన్నాయని, వాటిని చిట్యాలలో కలపాలని మంత్రికి ఎమ్మెల్యే వీరేశం వినతిపత్రం అందజేశారు. నార్కట్పల్లిలో సబ్మార్కెట్ యార్డు నిర్మించాలని కోరారు. చిట్యాలలో అదనపు అండర్పాస్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ మంత్రికి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్య వినతిపత్రాలు అందజేశారు. చిట్యాల జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించే అండర్ పాస్ వే బ్రిడ్జితో పాటు అదనంగా మరో రెండు చోట్ల నిర్మించి రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. మండలంలో అర్హులైన వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, పెద్దకాపర్తి చెర్వు నుంచి చిన్న కాపర్తి వరకు పిల్లాయిపల్లి కాల్వ తవ్వే పనులు పొడిగించాలన్నారు. అందుకు స్పందించిన మంత్రి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి అధనపు అండర్ పాస్ వేల నిర్మాణం పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని సీపీఐ(ఎం) నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, అధికారులు, సీపీఐ(ఎం) నాయకులు బొబ్బలి సుధాకర్రెడ్డి, రూపని ఇద్దయ్య, బొడ్డు బాబురావు, గాదె ఎల్లేశ్, లోడే విష్ణుమూర్తి, గణేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES