- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రెండేళ్లలో అన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు బాగా ఉన్నాయని.. సకాలంలో ప్రాజెక్ట్లు పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేదన్నారు. కాళేశ్వరం కోసమే ₹లక్ష కోట్లు ఖర్చు చేశారని.. అది గొప్ప ప్రాజెక్ట్ అనుకుంటే భ్రమేనని తేలిపోయిందని విమర్శించారు. గోదావరి జలాల అంశానికి రాజకీయ రంగు పులుముకుందని తెలిపారు.
- Advertisement -



