Friday, June 13, 2025
E-PAPER
Homeజాతీయంరెండేండ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం

రెండేండ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం

- Advertisement -

రక్షణ శాఖ సహకారంతో ముందుకు
ఇద్దరు ఆర్మీ అధికారుల డిప్యూటేషన్‌కు రక్షణ శాఖ అంగీకారం
భవిష్యత్‌లో టన్నల్‌ ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక
యుద్ధ విమానాలతో ఎలక్ట్రో మాగటిక్‌ సర్వే : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ పనుల్ని రెండేండ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన టన్నెల్‌ ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు. బుధవారం ఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల్లో రక్షణ శాఖ సహాయాన్ని కోరారు. అనంతరం మంత్రి తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాకులో మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. మొత్తం 44 కి.మీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో… ఇప్పటికి 35 కి.మీ పూర్తి చేసినట్టు తెలిపారు. మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు అటవీ భూమిలో ఉందన్నారు. ఈ అటవీ భూమిలో టన్నెల్‌ పనుల కోసం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సహాయంపై కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున ఎలక్ట్రో మాగటిక్‌ సర్వే (హెలికాప్టర్‌ సర్వే) చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం ఆర్మీలో కల్నల్‌ పరీక్షిత్‌ మెహరా, బార్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ) మాజీ డీజీ జనరల్‌ హర్పాల్‌ సింగ్‌ను డిప్యుటేషన్‌పై తెలంగాణకు పంపేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పరీక్షిత్‌ మెహరా రెండేండ్ల పాటు కొనసాగుతారని తెలిపారు. ఆయన సేవలను ఎస్‌ఎల్‌బీసీతో పాటు దేవాదుల, సీతారామం తదితర పనుల్లో సద్వినియోగం చేసుకుంటామన్నారు. అలాగే, జనరల్‌ హర్పాల్‌ సింగ్‌ గౌరవ సలహాదారుగా సేవలందించనున్నట్టు చెప్పారు. వీరిద్దరి సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన అన్ని సొరంగాల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.
డెన్మార్క్‌ నుంచి లేటెస్ట్‌ టెక్నాలజీ…
డెన్మార్క్‌ నుంచి అత్యాధునిక ఎలక్ట్రో మాగటిక్‌ సర్వే పరికరాలు తీసుకురానున్నట్టు మంత్రి తెలిపారు. వీటిని హెలికాఫ్టర్‌కు అమర్చడం వల్ల 44 కి.మీ మొత్తం సొరంగం పరిస్థితి తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా సొరంగం వాస్తవ పరిస్థితి అంచనా వేయొచ్చన్నారు. 9 కిలోమీటర్ల మేరకే సొరంగం పనులు పెండింగ్‌ లో ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలను దష్టిలో పెట్టుకుని మొత్తం 44 కిలోమీటర్లు సర్వే చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 44 కిలోమీటర్ల సొరంగం మధ్యలో గాలి కూడా చొరబడే అవకాశం లేకుండా ఉందన్నారు. ఎన్టీఆర్‌ ఐ నిపుణులు ప్రొఫెసర్‌ తివారీ, ధన్బాడ్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. జులై 12 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -