”ఒక పార్వతి ఇద్దరు దేవ దాసులు’ సినిమా నిర్మా ణంలో నిర్మాతలు కె. మురళి (శరత్ వర్మ), బి.ఆనందబాబు తమకు మోసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా కోసం మేము రూ.2 కోట్లు పెట్టుబడిగా పెట్టాం. సినిమాకి అయిన మొత్తం ఖర్చు కూడా మేమే భరించాం. తిరిగి ఇవ్వలేకపోవడంతో సంబంధిత వ్యక్తి రామకృష్ణ తోట సెప్టెంబర్ 12న (2024 ) మా పేర్లపైకి సినిమా రైట్స్, కాపీరైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పనులు కొనసాగుతున్నాయి.
అయితే మాకు సహకరించాల్సిన రామకష్ణ తోట మాపై విశ్వాస ఘాతుకం చేశాడు. సినిమా తనదేనని ప్రక టించి, అనుమతి లేకుండా టైటిల్, పోస్టర్లను పత్రికల్లో ప్రచురించాడు. ఇది మా హక్కులపై దాడి చేయడమే కాదు. మమ్మల్ని దారుణంగా మోసంగా చేయటమే. మాకు ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా మా ప్రతిష్ట కూడా దెబ్బ తిన్నది అని తెలిపారు. రామకష్ణ తోటపై సెక్షన్ 406, 420 (మోసం, విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద, అలాగే కాపీరైట్ చట్టం 1957 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టేవారి హక్కులను రక్షించకపోతే ఈ రంగం నాశనం అవుతుంది.
సినిమా హక్కులను అతి క్రమించిన కుట్ర ఇది. ఈ విషయంలో నిర్మాతల మండలి కూడా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే నమ్మక ద్రోహం చేసే ఇటువంటి వాళ్ళపై ప్రభుత్వం, పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మాకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మేం తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే నూటికి నూరుశాతం న్యాయం మావైపే ఉంది అని నిర్మాతలు తెలిపారు.
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం
- Advertisement -
- Advertisement -