Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతాం..

దేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతాం..

- Advertisement -

ఎంపీ, ఎమ్మెల్యే ..
నవతెలంగాణ – పరకాల 
: అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరకాల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన మంజూరి పత్రాలు అందించడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో, ఎందరో ప్రాణ త్యాగం చేయడం జరిగిందన్నారు.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం నేడు 8 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఐనప్పటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకపోవడం జరుగుతుందన్నారు.గత సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే అర్హులైన పేదలకు ఎన్నికల హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల  మంజూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో సుమారు 218 కోట్లతో 4500 పైగా ఇండ్లను మంజూరి చేయడం జరిగిందన్నారు.అందుకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి లబ్ధిదారు రానున్న 15 రోజుల్లో  ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యే సూచించారు. లేనట్లయితే అర్హులైన మరోకరికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.

వరంగల్ అబివృద్ధికి ఎంపి, ఎమ్మెల్యే టీం వర్క్ :ఎంపి, డాక్టర్ కడియం కావ్య  : ఉమ్మడి వరంగల్ అభివృద్ధి కోసం జిల్లాలోని ఎంపీ ఎమ్మెల్యేలు టీం వర్క్ తో ముందుకు వెళ్లడం జరుగుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. సోమవారం పరకాల వ్యవసాయ మార్కెట్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలని కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మహిళా స్వయం సహాయ సంఘాలకు రుణాలు, 20వేల కోట్ల రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం సహాయనిది, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు  సంయుక్తంగా కృషిచేసి 16 వేల కోట్లు అభివృద్ధి నిధులను తీసుకురావడం జరిగింది అన్నారు. అందులో ప్రధానంగా మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం, ఇందిరమ్మ గృహాలు, స్వయం సహాయక సంఘాలకు ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ కార్యాలయంలో సైతం మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక స్వభావం మన కల్పించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరంకృషి చేయడం జరుగుతుందన్నారు. లో బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకు వెళుతున్న క్రమంలో టిఆర్ఎస్ బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.బిఆర్ఎస్ సోషల్ మీడియా పేరుతో కొంతమందికి వేతనాలు ఇచ్చి మరి ఫేక్ న్యూస్ సృష్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ నీ బధనం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. దుబాయి కేంద్రంగా ఫేక్ ఐడీలను సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఇదంతా గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్వయం సహాయక సంఘాల నుంచి రూ.1 లక్ష రుణ సదుపాయం: కలెక్టర్ ప్రావీణ్య  : ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనుకునే లబ్ధిదారులు మూడు దశల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకే ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి ముందస్తుగా పెట్టుబడి లేని పేదలకు మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఆ తదుపరి వచ్చే బిల్లులో లక్ష రూపాయలను రుణం ఇచ్చిన సంఘానికి క్రెడిట్ చేయబడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -