Sunday, October 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అలసత్వాన్ని సహించం

అలసత్వాన్ని సహించం

- Advertisement -

విధుల్లో నిర్వక్ష్యం చేస్తే కఠిన చర్యలు
కేంద్రం నుంచి రావాల్సిన వాటాలకు ప్రాధాన్యత ఇవ్వండి
అన్ని విభాగాలు ప్రతివారం నివేదిక అందించాలి
ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దనీ, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఎస్‌ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని చెప్పారు.

అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు వస్తాయో.. అలాంటి వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇకపై సీఎస్‌తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -