Tuesday, July 22, 2025
E-PAPER
Homeబీజినెస్500 కొత్త టచ్‌ పాయింట్లను తెరుస్తాం

500 కొత్త టచ్‌ పాయింట్లను తెరుస్తాం

- Advertisement -

– మారుతి సుజుకి సీఈఓ వెల్లడి
గూర్‌గావ్‌ :
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) ఉదరుపూర్‌లో తన 5,500వ సర్వీస్‌ టచ్‌ పాయింట్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 2,764 నగరాల్లో 40,000 సర్వీస్‌ బేలతో సేవలు అందిస్తోన్నట్టు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2024-25లో 2.7 కోట్ల వాహనాలకు సర్వీస్‌ను అందించినట్టు ఆ కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి తకేచి తెలిపారు. 2025-26లో కొత్తగా 500 టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 91 కొత్త టచ్‌ పాయింట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ వినియోగదారులకు సమీపంలో సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన సర్వీస్‌ అందించడమే తమ లక్ష్యమని హిసాషి తకేచి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -