Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీవో49 అమలు కాకుండా చూస్తాం

జీవో49 అమలు కాకుండా చూస్తాం

- Advertisement -

– గెజిట్‌ విడుదల కాలేదు : ఆదివాసీ గిరిజనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ
– పూర్తిగా రద్దు చేయాలని ఆదివాసీ గిరిజనుల డిమాండ్‌
నవతెలంగాణ-ఉట్నూర్‌

ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.49ను అమలు కాకుండా చూస్తామని ఎక్సైజ్‌, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ఐటీడీఏ మీటింగ్‌ హాల్‌లో శుక్రవారం గిరిజన పెద్దలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసే జీఓ నెం.49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యేలు, గిరిజన పెద్దలు డిమాండ్‌ చేశారు. దానిపై మంత్రి స్పందిస్తూ.. ఆ జీఓకు సంబంధించి ప్రభుత్వం ఇంకా గెజిట్‌ విడుదల చేయలేదని, ఈ విషయం అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చెప్పారని గుర్తు చేశారు. ఎంపీ గోడం నగేష్‌ కల్పించుకుని.. ఇప్పటికే గెజిట్‌ విడుదల చేసినట్టు చెప్పారు. వెంటనే మంత్రి అటవీ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ డా.సువర్ణతో ఫోన్‌లో మాట్లాడి అందరికీ వినిపించారు. గిరిజనులకు అన్యాయం చేసే ఏ పనీ ప్రభుత్వం చేయదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నెం.49 జీఓను నిలుపుదల చేసేందుకు ఎంత వరకైనా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్‌, కోవ లక్ష్మీ, హరీష్‌బాబు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ కలెక్టర్లు రాజర్షిషా, వెంకటేష్‌ ధోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీలు అఖిల్‌ మహాజన్‌, క్రాంతిలాల్‌ పాటిల్‌, ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌ సింగ్‌, డీఎఫ్‌ఓలు ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, నీరజ్‌ కుమార్‌ టిబ్రెవాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -