- Advertisement -
2025లో 1,42,000 మంది..!
న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ)కి ప్రపంచంలోని 1,42,000 మంది సంపన్నులు వలస వెళ్లే అవకాశం ఉందని హెన్లీ ప్రయివేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. 2026లో ఈ సంఖ్య ఏకంగా 1,65,000 చేరొచ్చని అంచనా వేసింది. 1 మిలియన్ డాలర్లు (రూ.860 కోట్లు) పైగా నికర ఆదాయాలు కలిగిన సంపన్నులు యుఎఇని ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది భారత్ నుంచి 3,500 మంది సంపన్నులు యూఏఈకి తరలిపోయే అవకాశం ఉందని భావించింది.
- Advertisement -