- Advertisement -
మాజీమంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రేవంత్రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా బందయ్యాయని మాజీ మంత్రి టి హరీశ్రావు విమర్శించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ బందైందని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి , జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందయ్యాయని తెలిపారు. నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందైదనీ, డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బందయ్యాయని పేర్నొన్నారు.
- Advertisement -