Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-మునుగోడు
అకాల వర్షంతో మార్కెట్లలో తడిసి ముద్దై మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారంమునుగోడు మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షాలకు పడిపోయినటువంటి పంట పొలాలను, తడిసిన వరి ధాన్యాన్ని రైతు సంఘం,సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షంతో పడిపోయిన వరి పొలాలకు తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా తేమ శాతం కండిషన్ పెట్టకుండా కొనుగోలు చేయాలని వారు కోరారు. మార్కెట్లలో ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ , అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.రైతులకు వరి ధాన్యాన్ని వర్షాల నుండి భద్రపరచుటకు పట్టాలు( తార్ బాలు ) ఇవ్వాలని కోరారు. మంత్రులు, వ్యవసాయ అధికారులు, తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం )పార్టీ మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, సీపీఐ(ఎం ) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, మునుగోడు సిపిఎం మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాట యాదయ్య, బల్లెం స్వామి, రైతులుసైదులు, నరేష్, శేఖర్, నరసింహ, రాములు, ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -