చోద్యం చూస్తున్న అధికారులు..
అక్రమ దారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు
దర్జాగా నిర్మాణాలు జరుగుతున్న నోటీసులతో కాలం గడుపుతున్న అధికారులు
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్.
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): కాటారం మండలంలో రేగుల గూడెంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని డివైఏప్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 183,145,176 లలో అనుమతి లేకుండా చట్టం 1905,1977 లకు విరుద్ధంగా గత కొంతకాలం నుంచి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని పలుమార్లు పత్రికా ప్రకటనలో ప్రజా సంఘాలు వినతి పత్రాలు ఇచ్చిన అధికారులలో ఏమాత్రం చలనం ఉన్నట్టుగా కనబడటం లేదన్నారు.రోజు దర్జాగా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మాత్రం నోటీసుల పేరుతో కాలం గడుపుతున్నారని దానికి బేస్మెంట్ నుంచి పూర్తిస్థాయి ఇల్లు కావడానికి వచ్చిన ఇండ్లు నిదర్శనంగా కనబడుతున్నాయని దీనిని బట్టి చూస్తే రేగుల గూడెం పరిధిలో జరిగే నిర్మాణాలు అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుందని ఆరోపించారు.అధికారులకు ఫోన్ చేసినప్పుడు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మాత్రమే అధికారులు స్పందించినట్టుగా చేస్తున్నారు,తప్పితే ఇప్పటివరకు ఒక్క కట్టడానికి కూడా ఆపడం గాని కూల్చడం గాని చేయలేదని నోటీసులు జారీ చేస్తూ లోపాయికార సహకారాన్ని అందిస్తున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయని నిజంగానే అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్మాణాలు జరిగేవి కాదని అనుమతులు లేనందుకు తగిన చర్యలు తీసుకున్నట్లుగా అనిపించడం లేదని అక్రమార్కుల విషయంలో కాటారంలో అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. చట్టం ప్రకారం ప్రభుత్వ అసైన్డ్ భూములలో నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తు ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బంది అవుతుందని అదేవిధంగా ఆ భూములు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉపయోగపడే విధంగా చూడాలి కానీ అటువంటిది ఎక్కడ కనిపించడం లేదని దీనికి ప్రధాన నిర్లక్ష్యం నిర్దిష్టంగా అధికారులదే కనబడుతుందని ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు నోటీసులకు పరిమితం కాకుండా తక్షణమే స్పందించి అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై కొరడా విధించాలని అవసరమైతే కూల్చివేయాలని లేని పక్షంలో ప్రభుత్వ వ్యవస్థలు అంటే భయం లేకుండా పోతుందని ఆ ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆ గ్రామాల్లో ఉండే నిరుపేద కుటుంబాలకు లేదంటే ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించే విధంగా అధికారులు చూడాలన్నారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్, అవసరమైతే అధికారుల నిర్లక్ష్యం మీద మానవ హక్కుల కమిషన్కు వెళ్తామని ఆయన హెచ్చరించారు.
అక్రమ కట్టడాలపై చర్యలేవి.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES