- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పంతకాని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, అన్నపూర్ణ గ్రానెట్స్ అన్నపూర్ణ శ్రీపతిరావు గురువారం మృతుని కుటుంబాన్ని పరమార్షించి 50 కిలోల సన్న బియ్యం, రూ.2 వేలు ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



