Sunday, July 13, 2025
E-PAPER
Homeసినిమాస్నేహితులు ప్రత్యర్థులుగా మారితే?

స్నేహితులు ప్రత్యర్థులుగా మారితే?

- Advertisement -

వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ సోనీ లివ్‌ తాజాగా మరో డిఫరెంట్‌ వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’తో అలరించటానికి సిద్ధమవుతోంది. ‘రైజ్‌ ఆఫ్‌ ది టైటాన్స్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. దేవా కట్టా, కిరణ్‌ జయ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ మ్యాన్‌ అండ్‌ ప్రూడోస్‌ ప్రొడక్షన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్స్‌పై విజరు కష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు.
ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి రాజకీయ ప్రస్థానాలు వారి మధ్య తెలియని దూరాన్ని పెంచాయి. మానసికంగా ఎంత దగ్గరి వారైనా రాజకీయ చదరంగంలో ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోక తప్పలేదు. అలాంటి ఇద్దరు స్నేహితుల కథే ‘మయసభ’. ఇందులో కాకర్ల కష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్‌.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు. ఈ సిరీస్‌ సోనీ లివ్‌లో ఆగస్ట్‌ 7 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం ‘మయసభ’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -