- Advertisement -
– ఎమ్మెల్యే గడ్డం వినోద్కుమార్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కృష్ణా జలాలపై ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాస్తవాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలకు వినే ఓపిక లేకపోతే ఎలా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్కుమార్ ప్రశ్నించారు. నదీ జలాల పంపకాల్లో బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో సీఎం వివరంగా చెప్పినా బీఆర్ఎస్ నేతలకు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో ప్రజాప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమానంతరం వినోద్కుమార్ విలేకర్లతో మాట్లాడారు.
- Advertisement -