- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతన ఎంపీడీఓ ఏం. బ్రహ్మానందం శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ నుంచి మాక్లూర్ మండల ప్రజపరిషత్ ఎంపీడీఓ గా బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం మదన్ పల్లి గ్రామంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్ లో పాల్గొన్నారు. గ్రామంలో డెంగ్యూ వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఓంకార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -