నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలంలోని కలిగోట్ గ్రామంలో రైతు వెదిక కేంద్రంలో జరిగిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు నాయకుడు ఇటీవల జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సలహా కమిటీ సభ్యునిగా నియమింపబడిన కోటపాటి నరసింహం నాయుడు పాల్గొన్నారు. కొలీ ప్యాక్ పిఏసిన్ చైర్మన్ నాగుల శ్రీనివాస్, శాస్త్రవేత్తలు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం నుండి కృష్ణ చైతన్య సాయి ప్రసాద్, మండలం వ్యవసాయ అధికారి శ్రీమతి దేవకి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్న సమావేశంలో రైతు నాయకుడు కోటపాటి మాట్లాడుతూ.. రైతులు పాత పద్ధతులు వీడి తమ తమ భూములను భూసార పరీక్షలు జరిపించుకొని, అధిక దిగుబడి నిచ్చే నూతన వంగడాలను పండించడం, ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందడం, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు పాటించి, రసాయనిక, పురుగు మందులను తగ్గిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించడానికి కృషి చేయాల్సిందిగా రైతులకు వివరించారు. సన్న బియ్యం రకాల వరి పండించడం ద్వారా అటు యం.యస్.పి పొందడం, దానితోపాటు క్వింటాల్ కు 500 బోనస్ పొందడం వల్ల రెండు రకాల లాభాలు గడించవచ్చు అనే విషయాన్ని వివరించారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ మరియు వాడకం భూసార పరీక్షలు జరిపించుకొని తగిన మోతాదులో మాత్రమే వాడాలని అన్నారు. పచ్చి రొట్టతో రసానిక ఎరువుల అవసరం తగ్గించా వచ్చని వివరించారు. మండల వ్యవసాయ అధికారికి దేవకి మాట్లాడుతూ తమ రికమండేషన్ చేసిన వాటిని కొనుగోలు చేసి రసీదులు తప్పనిసరిగా తీసుకొని భద్రపరచు కోవాలని రైతులను కోరారు. చైర్మన్ నాగుల శ్రీనివాస్ . రుక్మాజి రైతులు పాల్గొన్నారు.
రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్న కోటపాటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES