పోలీసుల దాడి బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ
తెనాలి : కేసులో నిందితులను తేల్చాల్సింది కోర్టులని, వారిపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. సిఎం చంద్రబాబుపై 24 కేసులున్నాయని, అలాగని ఆయనను నడిరోడ్డుపై తన్నటం ధర్మమేనా అంటూ పోలీసుల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై పోలీసులు బహిరంగంగా కొట్టడాన్ని నిరసిస్తూ, బాధితులైన స్థానిక ఐతానగర్లో చేబ్రోలు జాన్విక్టర్, దోమ రాకేష్ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం విలేకరులతో జగన్ మాట్లాడుతూ.. 25, 26, 27 తేదీల్లో యువకులను పోలీసులు కస్టడీలో వేధించారన్నారు. వారి కుటుంబాల పరువు దిగజారేంతగా నడిరోడ్డుపై రెండు ప్రాంతాల్లో త్రీ టౌన్, టూ టౌన్ సిఐలు దాడి చేసి, కోర్టుకు అప్పగిం చారని చెప్పారు. బాధితుల్లో ఇద్దరు యువకులు దళితులు కాగా, మరొకరు మైనారిటీకి చెందిన వారని తెలిపారు. ప్రభుత్వమే పోలీసులను అడ్డుపెట్టుకొని హింసలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కొట్టే హక్కు ఎవరిచ్చారు?
- Advertisement -
- Advertisement -