– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులెందుకు నమోదు చేయడం లేదనీ మాజీ పోలీస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, ఆయన సోదరులకు ఒక చట్టం, ఇతరులకు వేరే చట్టం ఉందా? ఉంటే చెప్పాలని కోరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి అని తాను కేసు పెట్టాననీ, తనకు తెలియకుండా ఆ కేసును పోలీసులు క్లోజ్ చేశారని ఆరోపించారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుని దౌర్జన్యంతో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నా.. అతనిపైనా చర్యల్లేవని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న కేసులు అక్రమ కేసులనీ, గాంధీభవన్ లో రహస్య ఎఫ్ఐఆర్ లు తయారవుతున్నాయని విమర్శించారు. కొణతం దిలీప్తో సహా బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్పై పెట్టిన తప్పుడు కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ విసిరిన లైడిటెక్టర్ సవాల్కు సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమెరికాకు వెళ్లి కేటీఆర్ తెలంగాణకు, దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై కేసులెందుకు పెట్టరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES